నవతెలంగాణ – హైదరాబాద్: హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు-టిప్పర్ ఢీ కొన్న ఘటనలో తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతులను కుత్బుల్లాపూర్కు చెందిన కుమార్ (40), ప్రదీప్ (8)గా గుర్తించారు. బైకును టిప్పర్ ఢీ కొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైకు పూర్తిగా దగ్ధమవ్వగా.. టిప్పర్ లారీ పాక్షికంగా దెబ్బతింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.