ఘనంగా గణిత దినోత్సవం

నవతెలంగాణ –  అశ్వారావుపేట 
గణిత పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజం జయంతి వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీనివాస రామానుజం చిత్రపటం కు ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత తో పాటు బోధనా ఉపాధ్యాయులు పుష్పాలు సమర్పించి నివాళ్ళు అర్పించారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన గణిత ఫేర్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love