ఘనంగా ఓటర్స్ దినోత్సవం

– తాహాసిల్దార్ కోడి చింతల రాజు
నవతెలంగాణ నెల్లికుదురు: ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. తాహాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయం నుండి గురువారం అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి మనోహరం నిర్వహించారు.  ప్రతిజ్ఞ చేసి ఓటు హక్కుపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అ ఈ సందర్భంగా తాహాసిల్దార్ కోడి చింతల రాజు, ఎస్సై క్రాంతి కిరణ్, డిప్యూటీ తాహాసిల్దార్ తరంగిణి ఎంపీడీవో శేషాద్రి ఎంపీఓ బండారు పార్థసారథి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఏపీవో మాధవి, ఏపిఎం వరదయ్య, మండల వ్యవసాయ అధికారి నెలకుర్తి రవీందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ బీరవెల్లి యాదగిరి రెడ్డి, ఎంపీటీసీ వాణి శ్రీనివాస్ లు ఈ సందర్భంగా సీనియర్ ఓటరును ఘనంగా సత్కరించారు. వికలాంగులకు కూడా శాలతో ఘనంగా సత్కరించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయ బృందం ఐకెపి వెలుగు సిబ్బంది, తాహాసిల్దార్ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పోలీసు బృందం విద్యార్థులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love