హత్రాస్ ఘటన అత్యంత విషాదం: రాహుల్ గాంధీ

నవతెలంగాణ – లక్నో: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 80కి పైగా భక్తులు మరణించారు. వందలాది మంది గాయాపాలయ్యారు. హత్రాస్ ఘటనపై కాంగ్రెస్ నేత, లోక్ సభ ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. హత్రాస్ ఘటన చాలా బాధాకరం అన్నారు రాహుల్ గాంధీ.   మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి  తెలిపారు. గాయపడినవారు త్వరలో కోలుకో వాలని కోరుకున్నారు. యూపీ ప్రభుత్వం సహాయ చర్యలు వేగవంతం చేయాలని అన్నారు. బాధితులకు ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. గాయపడిన, బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ కార్యకర్తలు  సహాయాన్ని అందించాలన్నారు.

Spread the love