ఆయన తెలంగాణ తొలిపొద్దు , తెలంగాణ కాంక్షించి యోధుడు

తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల హక్కులకోసంనిక్కిచ్చిగా పోరాడిన మహావ్యక్తి కాళోజి .నా గొడవపేరుతోప్రజాసమస్యలను అద్భుతంగా ఆవిష్కరించరు. తమ జీవితాంతం తెలంగాణ ప్రజల కోసం అంకితం చేసిన మహానీయులు తన భావాలను తెలంగాణ యాసలో సులువుగా అర్థమ య్యేవిధంగా చెప్పేవారు. తెలంగాణ భాష అణచవేతకు వ్యతిరేకంగా గళం మరియు కలం ఏత్తినారు. నిజాం రాజు యొక్క అరాచకపాలకు వ్యతిరేకంగా ఎమాత్రం సంకోచించకుండా పోరాడారు. తెలంగాణ ఉద్యమంతో పాటు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. కాళోజీ 1914 కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లిలో జన్మించారు. కాలోజీ పుట్టింది కర్ణాటక అయినా కన్నడ హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలు కూడా బాగా వచ్చేవి. బీజాపూరు నుంచి వచ్చి వరంగల్ జిల్లాలోని మడికొండలో వచ్చి స్థిరపడ్డారు. ప్రజల యొక్క సమస్యలను తన గేయాలరూపంలో  వర్ణించేవారు. ప్రాథమికవిద్యను మడికొండలో పూర్తి చేసుకుని హైదరాబాద్లోని చవ్మాహాల్ పాఠశాలలో, సిటీ కాలేజీ హన్మకొండలో కాలేజీ విద్యాను పూర్తిచేసి 1939లో న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టాపొందారు. చదువు యొక్క ప్రాధాన్యత గుర్తించి ప్రతి గ్రామంలో ఒక లైబ్రరీ ఉండాలని కోరుకునేవారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని కేవలం 25 సంవత్సరాల వయసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఈ కాలంలో మనం చూసే పొలిటికల్ ఆ రోజుల్లోనే రాశారు. బురుగులరామ కృష్ణారావు, పీవీనరసింహారావు వంటి వారితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. గణపతి ఉత్సవాలు జరిపారు. తెలంగాణ ప్రజల్లో చదువు యొక్క ప్రాముఖ్యతను వ్యాపింప చేయడానికి ఆంధ్ర సారస్వత పరిషత్ ను స్థాపించిన ప్రముఖులలో ఒకరు. రజాకార్ల దౌర్జన్యానికి వ్యతిరేకంగా మహా సభలు పెట్టి ధైర్యసాహసాలను ప్రదర్శించారు. స్వరాజ్యసమరంలో ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగపూర్యూనివర్సిటీలో చేర్పించి ఆదుకున్నారు. 1972వ సంవత్సరంలో తామ్రపత్ర పురస్కారము,1992లో పద్మ విభూషణ్ అవార్డును పొందారు. 1992 కాకతీయయూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. కాలోజీ నవంబర్13,2002వసంవత్సరంలో తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తుది శ్వాస విడిచారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజిపై గౌరవ సంఘ తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించింది. కాళోజీ పేరు మీద వరంగల్లో ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టింది. అనుమకొండలో కాళోజీ క్షేత్రం కూడా నిర్మించబోతున్నారు. పుట్టుకనిది చావు నీది బతకంతా దేశానిది అని దేశ భక్తిని చాటుకున్న వ్యక్తి. అభ్యర్థి ఏ పార్టీ వాడని కాదు ఏఏ పాటి వాడో చూడు ఎన్నుకుంటే వెలగబెట్టడం కాదు ఇప్పటిదాకా ఏం చేశాడో చూడు. పెట్టుకొన్న టోపి కాదు పెట్టిన టోపీ చూడు అంటూ తన గొడవ ప్రజల కోసం అంటూ ప్రశ్నించిన భయంలేని కవి ప్రజా కవి కాళో జి. నాది బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష ఇతర భాషల పై మోజుతో మాతృభాషను విస్మరించే వారిని ధైర్యంగా హెచ్చరిస్తారు. అందుకే ఆయన జయంతి తెలంగాణ భాష దినో త్సవంగా మారింది. ఏ భాష నీది ఏమి వేషము రా ఈ భాష ఈ వేషం ఎవరికోసం రా ఆంగ్ల మందును మాటలనగానే ఇంత కులుక కుల్కెదవెందుకురా, తెలుగువాడివై తెలుగు రాదను చుసిగ్గు లేక ఇంకా చెప్పు ఎందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్ర రంబురాదంచుసకిలించు ఆంధ్రుడా సావవెందుకురా అంటూ తెలుగు భాష పైన మాండలిక భాష పైన ఉన్న ప్రేమను స్పష్టంగా వ్యక్తికరించాడు. ఇట్లా అన్ని కోణాలలో ప్రపంచంలో జరుగుతున్న గందరగోళాలన్నింటికీ గొడవ స్పందించింది. కవితల తూటాలుచిందించింది. అడ్డమైన మురికినంత తన్నేసేజీవనది అతని గొడవ నా గొడవకు ప్రాప్తి అన్యాయాన్నిఎదిరించినోడే నాకు ఆరాధ్యుడు అంటూ తన స్పష్టతను వివరించాడు. తన మరణంతరం కాకతీయ వైద్య కళాశాలకు తన దేహాన్ని దానంచేసి వేలాదిమందికి నిస్వార్థ సేవలో స్ఫూర్తిని నింపారు. తెలంగాణ మాండలికం గ్రామీణుల్లో ఓటుపై అవగాహనకు  పుస్తకం రాసారు. తెలంగాణ తొలిపొద్దు, నిత్యం ప్రసరించే భానుడు. అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ గొడవ పడే కాళోజీకి సమసమాజం నిజమైన నివాళి.
– ఉమాశేషారావు వైద్య
Spread the love