- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ముంబైలోని మంఖుర్డ్, జనతా నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా శనివారం రాత్రి మూడు అంతస్తుల చాల్లోని ఒక భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో రెండు మూడు ఇళ్లు దెబ్బతినడంతో, నలుగురు మహిళలతో సహా ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి.
- Advertisement -



