చిన్ననాటి మిత్రుని కుటుంబానికి చేయూత

నవతెలంగాణ-ఆమనగల్ : కడ్తాల్ మండల కేంద్రానికి చెందిన రేడియోల ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1991-92 బ్యాచ్ కు అతని చిన్ననాటి మిత్రులు సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమవంతు తక్షణ సహాయంగా మిత్రుని కుటుంబానికి రూ.1,02,000లు అందజేశారు. అదేవిధంగా తమ క్లాస్ మేట్ శ్రీనివాస్ కుమారుడు ప్రశాంత్, కూతుర్లు సిరి, లక్ష్మీ ప్రసన్నలను  అన్నివిధాలా ఆదుకుంటామని శ్రీను భార్య ప్రభావతికి భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో శ్రీను క్లాస్ మేట్స్ ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ (టీపీసీసీ కార్యవర్గ సభ్యులు), చాట్ల వెంకటేష్, యం.డి.జహాంగీర్ అలి, గంప శ్రీనివాస్ గుప్తా, రమేష్ గౌడ్, రాఘవేందర్, శేఖర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love