- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను దశల వారిగా మోడీ ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచింది. సిలిండర్ ధరను రూ.29 మేర పెంచింది బీజేపీ ప్రభుత్వం. మూడు నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. దిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.913 నుంచి రూ.942కు చేరింది. పెంచిన ధరలు నేటి (జూన్ 7) నుంచి అమల్లోకి రానున్నాయి. మార్చి 7న గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచింది.
- Advertisement -

![వాస్తవాలను దాచిన అమెరికా!]](https://navatelangana.com/wp-content/uploads/2026/06/Trump_India.jpg-1-696x428.webp)

