రైల్ వ్యాగన్లు, కోచ్‌లను తయారు చేసేందుకు భాగస్వామ్యం చేసుకున్న హిందాల్కో, టెక్స్‌మాకో

– భారతదేశంలో ప్రపంచ స్థాయి తయారీ కేంద్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి
– అల్యూమినియం వినియోగం వేగం మరియు పేలోడ్‌ను పెంచుతుంది మరియు CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది
– రైల్వే యొక్క నెట్ – జీరో లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం రోలింగ్ మరియు రీసైక్లింగ్ కంపెనీ అయిన హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు ప్రత్యేక ఇంజనీరింగ్ కంపెనీ టెక్స్‌మాకో రైల్ & ఇంజినీరింగ్ లిమిటెడ్ వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నాయి. ఈ భాగస్వామ్యం లో భాగంగా  భారతీయ రైల్వేలకు తమ ఉద్గార లక్ష్యాలు చేరుకోవటం మరియు ఆపరేటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవటం లో సహాయపడుతూ ప్రపంచ స్థాయి అల్యూమినియం రైల్ వ్యాగన్‌లు మరియు కోచ్‌లను అభివృద్ధి చేయడం మరియు తయారు చేయడం చేయనున్నాయి. సరకు రవాణాలో 45% మార్కెట్ వాటాను సాధించే లక్ష్యంతో 2027 నాటికి 3,000 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యాన్ని చేరుకోవటం ద్వారా తమ ప్రస్తుత సామర్ధ్యం రెట్టింపు చేసే లక్ష్యంతో భారతీయ రైల్వే “మిషన్ 3000 MT” ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి  వ్యాగన్ డిజైన్‌ను మెరుగుపరచడానికి చురుకుగా ప్రయత్నిస్తుండటం తో పాటుగా  మొత్తం మీద సామర్థ్యాన్ని మరియు రైల్వే ఆస్తుల జీవిత కాలాన్ని పెంచడానికి అనువుగా  తమ స్వంత డిజైన్‌లను అందించాల్సిందిగా వ్యాగన్ తయారీదారులను రైల్వే  ఆహ్వానిస్తోంది.
రైల్వేలో ఈ పరిణామాలను గుర్తించిన , హిందాల్కో మరియు టెక్స్‌మాకో అవకాశాలను అన్వేషించడానికి చేతులు కలిపాయి, ఇక్కడ హిందాల్కో తమ ప్రత్యేకమైన అల్యూమినియం మిశ్రమాల ప్రొఫైల్‌లు, షీట్‌లు మరియు ప్లేట్‌లను ఫాబ్రికేషన్ మరియు వెల్డింగ్ నైపుణ్యంతో పాటు అందిస్తుంది. గత సంవత్సరం ప్రారంభించబడిన సంస్థ యొక్క అంతర్గత అల్యూమినియం ఫ్రైట్ రేక్ 180 టన్నుల లైటర్  మరియు టెర్ వెయిట్ రేషియోకి 19% అధిక పేలోడ్‌ను అందిస్తుంది, సాపేక్షంగా అతితక్కువ వేర్ అండ్ టియర్ తో  తక్కువ శక్తిని వినియోగిస్తుంది. టెక్స్‌మాకో, 80 సంవత్సరాలుగా సరుకు రవాణా కార్స్  తయారీలో  నైపుణ్యం కలిగిన సంస్థ. ఇది తమ సాంకేతిక నైపుణ్యాన్ని తీసుకువస్తుంది మరియు డిజైన్, ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ లైన్ ఏర్పాటు మరియు నైపుణ్యం కలిగిన కార్మికులను అందించడానికి బాధ్యత వహిస్తుంది. ఈ భాగస్వామ్యం గురించి హిందాల్కో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సతీష్ పాయ్ మాట్లాడుతూ, “భారతదేశం యొక్క మొట్టమొదటి అల్యూమినియం రేక్‌ను ప్రారంభించడంతో, అల్యూమినియం రేక్‌లు అందించే అధిక పేలోడ్ మరియు గణనీయమైన CO2 తగ్గింపు ప్రయోజనాలను మేము ప్రదర్శించాము. ఈ భాగస్వామ్యం సరకు రవాణా పరిశ్రమ మరియు ప్రయాణీకుల మొబిలిటీ  కోసం విలువ ప్రతిపాదనను పెంపొందించడంలో మా పాత్రను మరింత బలోపేతం చేస్తుంది, అదే సమయంలో రైల్వేలు దాని నెట్ జీరో లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి…” అని అన్నారు. టెక్స్‌మాకో రైల్ & ఇంజినీరింగ్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ శ్రీ ఇంద్రజిత్ ముఖర్జీ మాట్లాడుతూ “ఈ విలువైన భాగస్వామ్యం వినూత్నమైన మరియు స్థిరమైన ఉత్పత్తులను రూపొందించడంలో పరిశ్రమ యొక్క కార్బన్ పాదముద్రను తగ్గించడం మరియు సానుకూల పర్యావరణ ప్రభావాన్ని పెంచడం పట్ల మా నిబద్ధతను మరింత బలోపేతం చేయడంలో చాలా దోహదపడుతుంది” అని అన్నారు.
ఈ గణనీయమైన లాభాలు హిందాల్కో మరియు టెక్స్‌మాకోలను ఆత్మనిర్భర్ భారత్ కలల సాధనలో పూర్తి స్థాయిలో ముందుకు సాగేలా ప్రోత్సహించాయి మరియు ఆధునిక సౌకర్యాలతో మెరుస్తున్న కొత్త స్టేషన్‌లను నిర్మించడం, అలాగే  అత్యాధునిక  కోచ్‌లు మరియు మెట్రో రైలు నెట్‌వర్క్‌లో వేగవంతమైన విస్తరణ వంటి రెండు ప్రాథమిక మౌలిక సదుపాయాల పరంగా భారీ అప్‌గ్రేడేషన్‌లో ఉన్న రైల్వేలకు సహాయం చేశాయి. టెక్స్‌మాకో రైల్ & ఇంజినీరింగ్ లిమిటెడ్. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుదీప్త ముఖర్జీ మాట్లాడుతూ “తక్కువ కార్బన్ ఫుట్‌ప్రింట్‌తో సమర్థవంతమైన రోలింగ్ స్టాక్‌ను పరిచయం చేయడంలో భారతీయ రైల్వేలకు మద్దతు ఇవ్వడంలో ఈ భాగస్వామ్యం అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది” అని అన్నారు.  అధిక-నాణ్యత గల అల్యూమినియం వ్యాగన్‌లు, కోచ్‌లు, పెద్ద కంటైనర్‌లు మరియు భాగాలను తయారు చేయగల స్వదేశీ సదుపాయం,   సామర్థ్యం పెంచడానికి మరియు   సరుకు రవాణా సుంకాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం  ఉద్దేశించిన డెడికేటెడ్  ఫ్రైట్ కారిడార్‌ల యొక్క వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది.

Spread the love