మహిళా సాధికారత బృందం ఆధ్వర్యంలో బాలింతలకు సన్మానం

నవతెలంగాణ -వలిగొండ రూరల్ : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో- బేటి పడావో కార్యక్రమంలో భాగంగా భేటీ జన్మతోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా సాధికారత బృందం ఆధ్వర్యంలో గురువారం అరూర్ పల్లె దవఖానాలో ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులను సత్కరించడం జరిగింది. బాలింతలకు చీరలు, పుట్టిన ఆడపిల్లలకు ఫ్రాకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జ్యోతి, డి హెచ్ ఈ డబ్ల్యూ భార్గవి, సుమలత, హెల్త్ అసిస్టెంట్లు శోభారాణి, సంధ్య, అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Spread the love