- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్లోని జంజాన్ సమీపంలో జరిగిన ఒక భారీ పేలుడులో ఆ దేశ రివల్యూషనరీ గార్డ్స్ కు చెందిన 14 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. యుద్ధ సమయంలో శత్రు దేశాలు ప్రయోగించిన ‘క్లస్టర్ బాంబులు’, ఎయిర్మైన్లు ఈ ఘటనకు కారణమని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. యుద్ధం ముగిసినప్పటికీ, భూమిలో నిక్షిప్తమై ఉన్న ఈ పేలుడు పదార్థాలు ఐఆర్జీసీ దళాలు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఈ ఘోరం జరిగినట్లు సమాచారం.
- Advertisement -



