అందంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఎప్పుడూ బ్యూటీ పార్లర్కు వెళ్లి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కంటే.. ఇంట్లో కూడా మనం ముఖాన్ని మెరిపించుకోవచ్చు. పెద్దగా ఖర్చు కూడా ఉండదు. రెండు, మూడు రోజుల మెరుపును తీసుకొచ్చే ఫేషియల్స్ కంటే.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెరుపును, రంగును పెంచే కొన్ని హౌమ్ మేడ్ టిప్స్ గురించి చూద్దాం.
ట్యానింగ్ చేసుకోండి:
ట్యానింగ్ అంటే.. ముఖంపై ఉండే మురికిని పోగొట్టుకోవడం. ఇందు కోసం ట్యాన్ రిమూవర్ క్రీమ్స్ బయట మార్కెట్లో ఉంటాయి. అవి తెచ్చుకుని ముఖానికి రాసి రుద్ది క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మురికి పోతుంది. రాత్రి నిద్రపోయేముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఉదయం మామూలు నీళ్ళతో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంమెరుస్తూ కనిపిస్తుంది.
పాలు – రోజ్ వాటర్:
బయట క్రీమ్స్ వద్దు అనుకునేవారికి ఇంట్లో కూడా చర్మాన్ని మెరిపించే క్రీమ్స్ ఉన్నాయి. కొద్దిగా పాలలో రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలపండి. దీన్ని ఇప్పుడు ముఖానికి పట్టించి.. చేతితో మసాజ్ చేసి.. ఓ పది నిమిషాలు ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల మురికి పోతుంది.
బియ్యం పిండి:
చర్మంపై ఉండే మురికిని వదిలించడంలో బియ్యం పిండి, శనగ పిండి చక్కగా పని చేస్తాయి. ఏదో ఒకటి తీసుకుని ఇందులో కొద్దిగా పెరుగు, టమాటా గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేయండి. పది నిమిషాలు ఉంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం.
ముల్తానీ మట్టి:
ముల్తానీ మట్టి కూడా చర్మాన్ని క్లీన్ చేస్తుంది. చర్మంపై ఉండే మురికిని తొలగిస్తుంది. కొద్దిగా ముల్తానీ మట్టి, పాలు, గంధం పొడి, తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. చర్మాన్ని తడి చేసి ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయాలి. చేతులు, కాళ్లపై కూడా రాసుకోవచ్చు. ఓ పావుగంట ఉంచి ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.