100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు..

-వడ్లూర్ సభలో కవ్వంపల్లి సత్యనారాయణ 

-కాంగ్రెస్ లోకి భారీగా గ్రామస్తుల చేరికలు 
నవతెలంగాణ-బెజ్జంకి : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాడిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని కరీంనగర్ జిల్లాధ్యక్షుడు,మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.శనివారం మండల పరిధిలోని వడ్లూర గ్రామంలో ఏర్పాటుచేసిన కార్నర్ మీటీంగ్ సభకు కవ్వంపల్లి సత్యనారాయణ హజరయ్యారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో గ్రామస్తులు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరగా కవ్వంపల్లి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులను విస్మరించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని..కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఉద్యమకారులను సముచిత స్థానం కల్పిస్తూ సుమారు 250 గజాల ఇళ్ల స్థలం అందజేస్తుందని కవ్వంపల్లి తెలిపారు.అంతకుముందు గ్రామంలో మండల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆరు గ్యారంటీలపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు.మండలంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,గ్రామస్తులు హజరయ్యారు.
Spread the love