నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు, బుధవారం ఉదయం ట్రేడింగ్లో స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. అయితే, బంగారం ధరకు భిన్నంగా వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఉదయం ట్రేడింగ్ వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.1,53,170కి చేరింది. మంగళవారం ముగింపు సమయానికి ఈ ధర రూ.1,53,160గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.10 మేర పెరిగి రూ.1,40,410 వద్ద నిలిచింది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,880గా నమోదైంది. మరోవైపు, వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. 100 గ్రాముల వెండిపై రూ.10 తగ్గి రూ.26,990కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ.100 మేర క్షీణించి రూ.2,69,900 వద్ద కొనసాగుతోంది.
పెరిగిన పసిడి ధర..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



