- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలోని పలు ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాల్లో,గ్రామపంచాయతీలలో మరియు పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో శనివారం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ కార్యాలయంలో తాహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులు,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జిసి మున్నయ్య,పోలీస్ స్టేషన్ లో సీఐ దూది రాజు,ఆయా గ్రామపంచాయతీలలో సర్పంచులు,ఆయా కార్యాలయాలలో సంబంధిత అధికారులు,నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సంబంధిత అధికారులు,సిబ్బంది,పలు పార్టీల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



