Wednesday, August 26, 2026
E-PAPER
Homeఆటలుభారత్-శ్రీలంక రెండో టెస్టు: ముగిసిన నాల్గో రోజు ఆట

భారత్-శ్రీలంక రెండో టెస్టు: ముగిసిన నాల్గో రోజు ఆట

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భారత్,శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ నాల్గో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సమయానికి,ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6వికెట్ల నష్టానికి 229పరుగులు చేసింది. ప్రస్తుతం 16పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది.నాలుగో రోజు ఉదయం శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 290పరుగుల వద్ద ముగించిన భారత్,వెంటనే ఫాలోఆన్ ఇచ్చింది.తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాటర్లు మెరుగైన ఆటతీరు కనబరిచారు.

ముఖ్యంగా,మరోసారి అద్భుతంగా ఆడిన పసిందు సూరియబండార (92),కమిందు మెండిస్ (55)భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.ఈ క్రమంలో కమిందు మెండిస్ ప్రసిద్ధ్ కృష్ణ ఔట్ చేయడంతో శ్రీలంక పతనం ప్రారంభమైంది.ఆకొద్దిసేపటికే,సెంచరీకి చేరువలో ఉన్న సూరియబండారను మానవ్ సుతార్ పెవిలియన్ చేర్చాడు.ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ధనంజయ డి సిల్వా (23),నిరోషన్ డిక్వెల్లా (6)కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు.వర్షం కారణంగా ఆట నిలిపివేసే సమయానికి,సోనల్ దినుషా (7),కేశర నువంత (3)క్రీజులో ఉన్నారు.ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ మరో 4వికెట్లు పడగొట్టి,ఆపై లక్ష్యాన్నిఛేదించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -