- Advertisement -
సీసీఓబీ ఫుట్బాల్ కప్
నవతెలంగాణ-హైదరాబాద్ : సిటీకాలేజ్ ఓల్డ్ బాయ్స్ (సీసీఓబీ) ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీసీఓబీ కప్ (అండర్-21) విజేతగా హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్సీ నిలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ స్పోర్టింగ్ ఎఫ్సీపై 1-0తో హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్సీ గెలుపొందింది. సయ్యద్ ఇంతియాజ్ అహ్మద్ 55వ నిమిషంలో గెలుపు గోల్ అందించాడు. అంతకుముందు సెమీఫైనల్లో ఆతిథ్య సీసీఓబీపై 1-0తో, క్వార్టర్ఫైనల్లో సైదాబాద్ ఎఫ్సీపై 5-0తో హైదరాబాద్ గ్లోబ్ గెలుపొందింది. హైదరాబాద్ గ్లోబ్ ఎఫ్సీ జట్టును, కోచ్లు వహీద్ ఖాన్, సయ్యద్ ఓవైస్ ఉద్దీన్లను సీసీఓబీ క్లబ్ అధికారులు అభినందించారు.
- Advertisement -



