- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి : ఈదురుగాలులకు రేకులతో నివాసమేర్పాటు చేసుకున్న అవాసం ధ్వంసమైందని..ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్లు అందించి అదూకోవాలని మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర రాజేశ్వరి గురువారం విజ్ఞప్తి చేసింది. ఈదురుగాలులకు రేకుల నివాసం ధ్వంసమై వంట సామాగ్రి, వస్తువులు చెల్లాచెదురయ్యాయని బాధితురాలు రాజశ్వరి అవేదన వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే, మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక చోరవచూపి ఇందిరమ్మ ఇళ్లు మంజూరీ చేసి అదూకోవాలని రాజేశ్వరి కోరారు.

- Advertisement -



