సింధు శుభారంభం

సింధు శుభారంభం– ఆసియా చాంపియన్‌షిప్స్‌
నింగ్‌బో (చైనా) : ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌లో పి.వి సింధు శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో మలేషియా షట్లర్‌ జిన్‌ వీపై మూడు గేముల్లో గెలుపొందిం. 18-21, 21-14, 21-19తో సింధు చెమటోడ్చి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకుంది. ఆకర్షి కశ్యప్‌ 10-21, 11-21తో బుసానన్‌ (థారులాండ్‌) చేతిలో, మాళవిక బాన్సోద్‌ 18-2, 19-21తో యు జిన్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓడారు. మెన్స్‌ సింగిల్స్‌లో హెచ్‌.ఎస్‌ ప్రణరు 17-21, 23-21, 23-21తో గెలుపొందగా.. లక్ష్యసేన్‌ 19-21, 15-21తో, కిదాంబి శ్రీకాంత్‌ 14-21, 13-21తో, రజవత్‌ 9-2, 13-21తో నిరాశపరిచారు. మహిళల డబుల్స్‌లో ట్రెసా జాలి, గాయత్రి జోడీ 2-21, 11-21తో చేతులెత్తేసింది. మెన్స్‌ డబుల్స్‌లో కృష్ణప్రసాద్‌, సాయిప్రతీక్‌ జోడీ.. అర్జున్‌, కపిల జోడీ, హరిహరణ్‌, రూబెన్‌ జోడీ వరుస గేముల్లో ఓటమి చెందారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సతీశ్‌, ఆద్య జోడీ సైతం 12-21, 13-21తో నిరాశపరిచింది.

Spread the love