త్వరలో రానున్న ఐపీఎల్ షెడ్యుల్

నవతెలంగాణ –  హైదరాబాద్ : క్రికెట్  అభిమానులు ఎప్పుడెప్పడా అని ఎదురుచూసే తీపి కబురు అతి తొందర్లోనే  రానున్నదని విశ్వనీయవర్గాల ద్వారా సమాచారం అందింది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ( ఐ పీ ఎల్ ) కొత్త సీజన్ 2024 షెడ్యుల్ ను  ప్రకటించేందుకు నిర్వాహకులు సిద్దమయ్యారు. మార్చి 22 నుండి మ్యాచ్ లు ప్రారంభమవుతాయని వినికిడి. వివిధ కథనాల ప్రకారం.. గతేడాది ఫైనలిస్టులు చెన్నై సూపర్ కింగ్స్‌ X గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఈ సారి తొలి మ్యాచ్‌ ఉంటుందని సమాచారం. టోర్నీ మొత్తం భారత్‌ వేదికగా జరుగుతుందని ఇప్పటికే ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ వెల్లడించారు. తొలి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటిస్తారని.. ఎన్నికల తేదీలను బట్టి పూర్తిస్థాయి షెడ్యూల్‌ వెల్లడిస్తారని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.

Spread the love