కమ్యూనిస్టులను ఆదరించేది ఆదివాసి లే…

 – సీపీఐ(ఎం) అభ్యర్ధులు గెలిస్తే కేరళ మోడల్ పాలన
 – ధన అహంకారం ప్రదర్శిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ఓడించండి
 – సీపీఐ(ఎం) జాతీయ నాయకులు వెంకట్ పిలుపు
నవతెలంగాణ- అశ్వారావుపేట: కమ్యూనిస్టులను అత్యధికంగా ఆదరించే ఆదివాసి లేనని, వీరికోసం చేసేది కమ్యూనిస్టు మాత్రమే నని, అటవీ గిరిజనుల, సంఘటిత, అసంఘటిత కార్మికులు,కర్షకుల,శ్రామికుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పనిచేసే సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల ను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని పార్టీ జాతీయ నాయకులు బి.వెంకట్ ప్రజలకు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని వినాయకపురం పంచాయితీ దబ్బతోగు లో మండల కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీపీఐ(ఎం) అభ్యర్ధులు గెలిస్తే కేరళ మోడల్ లో పరిపాలన చేసే అవకాశం ఉంటుంది అని, అక్కడి సీఎం పినరయ్ విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ఆదివాసీలు అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది అని అన్నారు. ఇందులో భాగంగా 3 లక్షల గిరిజన కుటుంబాలకు రూ.7 లక్షల 40 వేల తో గృహాలు నిర్మించింది అనీ అన్నారు.గడిచిన 6 సంవత్సరాలలో 2 లక్షల 70 వెలు ఉద్యోగాలు కల్పించారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్ధులు ధన అహంకారం ప్రదర్శిస్తూ ఓటుకు నోటు బేరం చేస్తున్నాయని, ఇలాంటి పార్టీలను ఓడించాలని తెలిపారు. ప్రస్తుతం పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్ధులు మెచ్చా నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ లు కన్నా సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల అత్యంత నిజాయితీ, నిరాడంబరం గల వ్యక్తి అని,ఈయన్ని గెలిపించడం ద్వారా అశ్వారావుపేట నియోజక వర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈయన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం పై అమూల్యమైన ఓటు వేసి అర్జున్ గెలిపించాలని కోరారు. ఈ గ్రామానికి చేరిన బి.వెంకట్ కు ముందుగా పూలు జల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అభ్యర్ధి అర్జున్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బి.చిరంజీవి, మండల కమిటీ సభ్యులు గడ్డం సత్యనారాయణ, మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం నిర్మల, జగన్నాధం, శ్రీ వేణు తదితరులు పాల్గొన్నారు.
Spread the love