నిరుపేద ఆడపిల్లలకు జయశంకర్ ఫౌండేషన్ అండగా

నవతెలంగాణ – మహాముత్తారం 
చదువు మధ్యలో మానేసిన నిరుపేద ఆడ పిల్లలకు ఓపెన్ టెన్త్ ఫీజు చెల్లించి అండగా నిలుస్తున్న జయశంకర్ ఫౌండేషన్  జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహా ముత్తారం మండల కేంద్రానికి చెందిన దుగిని రాజేశ్వరి తన చిన్నతనంలోనే అమ్మానాన్నలు చనిపోవడంతో 5వ తరగతి వరకే చదివి మధ్యలో స్కూల్ మానేసి, అప్పటినుండి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తు, అప్పుడప్పుడు చదువుకునే పిల్లలను చూసి కంటతడి పెట్టుకునేది. చదువుకోవాలని ఉన్న చదివించే వాళ్ళు ఎవరు లేక తనలోతాను కుమిలిపోయేది. అలాగే   మహాదేవపూర్ మండల్ మెట్ పల్లి గ్రామానికి చెందిన ఏటా కోమలత చిన్నప్పుడే అమ్మానాన్నలు చనిపోవడంతో అమ్మమ్మ దగ్గర ఉంటూ కూలిపని చేసుకుంటుంది. వీరిద్దరికీ చదువు మధ్యలో మానేసిన నిరుపేద పిల్లలకు జయశంకర్ ఫౌండేషన్ వారు ఎగ్జామ్ ఫీజు కడుతున్నారని తెలుసుకొని జయశంకర్ ఫౌండేషన్ వారికి ఫోన్ చేసి వారి విషయం చెప్పడంతో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి  వారి ఇద్దరిని మహాదేవపూర్ మండల కేంద్రంలోని  ప్రభుత్వ స్కూల్ కు  తీసుకొని వెళ్లి ఓపెన్ టెన్త్ పరీక్ష ఫీజులు చెల్లించడంతో పలువురు ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలుపు తున్నారు.
Spread the love