పలువురిని పరామర్శించిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

నవతెలంగాణ-ఆర్మూర్
గత కొన్ని రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జర్నలిస్ట్ వడ్ల తిరుపతి తన వృత్తిలో భాగంగా పనిచేస్తుండగా తన చేతుకు గాయం అవ్వడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆర్మూరు మండల ఉపాధ్యక్షుడు ఆటోలో ప్రయాణిస్తుండగా సాయిలు కాలు విరగడంతో వీరిద్దరిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అబ్బగోని అశోక్ గౌడ్‌ పరామర్శించారు. సమాజ సేవ కోసం, ప్రజల కోసం పాటుపడుతున్న వడ్ల తిరుపతి మరియు సాయిలు ను భగవంతుడి దయవల్ల త్వరగ కోలుకోని యధావిధిగా తమ సేవను ప్రజలకు అందించాలని తెలిపారు. అందుకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అబ్బగోని అశోక్ గౌడ్ తెలియజేశారు.

Spread the love