అగ్ని ప్రమాద బాధితులకు జూపల్లి పరామర్శ

– రూ.5 వేలు ఆర్ధిక సహాయం

నవతెలంగాణ – అశ్వారావుపేట : వంట గ్యాస్ లీక్ అయి సోమవారం అగ్ని ప్రమాదం సంభవించి,మెరుపు కాలనీ పూరి గుడిసె వాసి పొట్టేళ్ల అడివమ్మ  మంగళవారం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు జూపల్లి రమేష్ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని ఓదార్చారు.నిత్యావసరాలు నిమిత్తం రూ.5 వేలు ఆర్ధిక సహాయాన్ని అందించారు.ఎమ్మెల్యే ఆదినారాయణ తో మాట్లాడి ఇందిరమ్మ గృహం మంజూరి కి కృషి చేస్తానని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట ప్రమోద్,నండ్రు రమేష్,కేదార్ నాధ్ తదితరులు ఉన్నారు.
Spread the love