ఎస్సై ఆంజనేయులు ను కలిసిన జువ్వడి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు యస్.ఐ ఆంజనేయులు  మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలని ఇలాంటి గొడవలు పెట్టుకోవద్దని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విడిసి అధ్యక్షులు గుర్రం శ్యామ్, ఉపాధ్యక్షులు వడ్ల శ్రీనివాస్, బద్దం పెద్ద రాజీ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పల్లె కిషన్, సంయుక్త కార్యదర్శి చాకలి సాయిలు, క్యాషియర్ గొల్ల సాయిమల్లు, జాయింట్ చెక్ పవర్ పర్సన్ చిన్నోల్ల లస్మయ్య, సలహాదారులు మైముధ్ అలి, గొలుసు రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Spread the love