ఒకే వేదికపై కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య

 – ఎసరు పెట్టుకున్న వారే.. ఎదురుపడిన సంఘటన
– ఆసక్తిగా చూసిన ప్రజలు…

నవతెలంగాణ – స్టేషన్ ఘన్ పూర్ : రాష్ట్ర రాజకీయాల్లో ప్రతీసారి చర్చల్లో నిలిచే స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గం. రాజకీయాల్లో ఇటీవల భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకరంటే మరొకరికి టిక్కెట్టు దక్కాలనే నేపథ్యంలో నాకంటే .. నాకే… ఎమ్మెల్యే టిక్కెట్టు అని బహిరంగంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఎసరు పెట్టుకున్న వారే.. ఈ వార్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సారి బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టిక్కెట్టు ఇచ్చారు. సోమవారం పాలకుర్తి నియోజక వర్గ పరిధి వల్మిడి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు హరీష్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ హజరయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్టేజీ మీద ఉండగా, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డా తాటికొండ రాజయ్య ఎదురు పడ్డారు. ఒకరినొకరు కరచాలనం చేసుకున్నట్లు సమాచారం. ఇదంతా గమనిస్తున్న ప్రజలు ఆసక్తికరంగా తిలకించారు. అంతలోనే ఎమ్మేల్యే రాజయ్య స్టేజీ నుండి దిగి వెళ్ళిపోయారు.

Spread the love