Wednesday, September 9, 2026
E-PAPER
Homeఖమ్మంసింగరేణి జీఎం కార్యాలయంలో 'కాళోజీ' జయంతి

సింగరేణి జీఎం కార్యాలయంలో ‘కాళోజీ’ జయంతి

- Advertisement -

నవతెలంగాణ-సత్తుపల్లి 
తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకను సింగరేణి సత్తుపల్లి ఏరియా ఏరియా జీఎం కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ సరికొండ వెంకటాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీఎం వెంకటాచారి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జీఎం వెంకటాచారితో పాటు వివిధ విభాగాల అధిపతులు, యూనియన్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -