నవతెలంగాణ – కరీంనగర్: కరీంనగర్ ముకరంపుర లోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.