వివక్షకు కేరాఫ్ కేటీఆర్..

– కరీంనగర్ ఎంపీ సోషల్ మీడియా వారియర్స్ లో కేటీఆర్ వాఖ్యలు ఖండించిన శ్రావణ్
– బడుగుల గెలుపు ఓర్వలేకే అనుచిత వాఖ్యలు చేస్తున్నారని అగ్రహం
నవతెలంగాణ-బెజ్జంకి
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుండి శాసనసభ అభ్యర్థులుగా ఎన్నికైన బడుగులపై విషం చిమ్మేలా కేటీఆర్ వాఖ్యలు చేయడం అయన బడుగు బలహీన వర్గాలపై చూపిస్తున్న వివక్షకు కేరాఫ్ గా నిలుస్తున్నాయని యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శానకొండ శ్రావణ్ శనివారం అగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక ఇంకా అధికార భ్రమల్లోనే కేటీఆర్ వాఖ్యలు చేస్తున్నారని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ లో కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన అనుచిత వాఖ్యలను శానకొండ శ్రావణ్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమనే విషయాన్ని కేటీఆర్ గుర్తుంచుకోవాలని శ్రావణ్ సూచించారు.
Spread the love