బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ..

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గుండా ఎల్లారెడ్డి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే. శనివారం మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అయన వెంట మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, గ్రామ నాయకులు ఉన్నారు.
Spread the love