నవతెలంగాణ – హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆయన ఇండ్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించింది. బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా.. వాటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. వాటితో పాటు సోదాల్లో రూ.99 లక్షల నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. పలు ఇన్ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ‘‘155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్ సాప్బుక్లు స్వాధీనం చేసుకున్నాం. ఇందుకు సంబంధించి బినామీలను విచారించాలి. ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది.