- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సిరికొండ మండలం పొన్న గ్రామానికి చేరుకుని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు నావర్గే పాండురంగ్ కుటుంబసభ్యులను పరామర్శించి భరోసా కల్పించనున్నారు. అనంతరం 12 గంటలకు నేరడిగొండ మండల కేంద్రంలో బోథ్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని పార్టీ సభ్యత్వంపై దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే అనిల్జాదవ్ పరిశీలించారు.
- Advertisement -



