రంగాపూర్ నుండి కొత్త బస్ సర్వీస్ ప్రారంభం

నవతెలంగాణ -తాడ్వాయి
వరంగల్ -2 డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ బస్సు శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామం నుండి ఉప్పల్ ఎక్స్ రోడ్ (హైదరాబాద్)కు కొత్త ఆర్టీసీ బస్ సర్వీస్ ను ఆర్టీసీ వరంగల్-2 డిపో మేనేజర్ జి సురేష్, అసిస్టెంట్ మేనేజర్ జ్యోత్స్న చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సర్వీసు ఉదయం 10 గంటలకు రంగాపూర్ నుండి బయలుదేరి బీరెల్లి, కాటాపూర్, తాడ్వాయి మీదుగా హైదరాబాద్ కు సర్వీస్ నడవనుంది. గత ఎన్నో సంవత్సరాల ఏజెన్సీ ప్రజల కోరిక తీరినందుకు ఆర్టీసీ వరంగల్-2  డిపో మేనేజర్ సురేష్ అసిస్టెంట్ మేనేజర్ జోష్నాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Spread the love