చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని సన్మానించిన నాయకులు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుక్రవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తాడూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ప్రజలందరికీ శుభ ప్రయాణం పరిమాణం అని అన్నారు.మునుగోడు అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో చౌటుప్పల్ మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో అమ్మ నాన్న అనాధ ఆశ్రమంలో తాడూరి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనాధలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఆశ్రమంలో 680 మంది అనాధలకు దుప్పట్లు పంపిణీ రెండు రోజులలో చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బ్లాక్ మండల పట్టణ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి బోయ దేవేందర్ సుర్వి నరసింహ గౌడ్ మండల పరిషత్ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య గౌడ్ ఎంపీటీసీలు మందుల శ్రీశైలం దోసపాటి జంగయ్య గౌడ్ కౌన్సిలర్ కొయ్యడ సైదులు గౌడ్ నాయకులు వెలుగ రాజశేఖర్ రెడ్డి పాశం శ్రీను దోనకొండ కృష్ణ కొసనం భాస్కర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, కంది భూపాల్ రెడ్డి మేకల దేవేందర్ రెడ్డి ఉదరి నరసింహ,జువ్వి నరసింహ,శేఖర్, సంజీవరెడ్డి,నగేష్ తదితరులు పాల్గొన్నారు
Spread the love