స్వంత గూటికి చేరుకున్న హస్తం నాయకులు

– కండువాలు కప్పి ఆహ్వానించిన దుద్దిళ్ల

నవ తెలంగాణ- మల్హర్ రావు:
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్ ప్రలోభాలకు గురై బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 24 గంటలు గడిచాక అసంతృప్తి చెందిన వారు శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితల రాజయ్య అధ్వర్యంలో హస్తం సొంత గూటికి చేరుకున్నారు. వారికి తెలంగాణ కాంగ్రెస్ మేనిపేస్టో చైర్మన్, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీదర్ బాబు కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కండువాలు కప్పుకున్న వారిలో పొట్ట హరీష్ బాబు, కంబాల శంకర్, మంతెన, సూర్య కిరణ్, పేట రాజేందర్, కంబాల లక్ష్మన్, వడ్ల కొండ రాజ బాబు, సింగనవెన శ్రీశైలం ఉన్నారు. శ్రీదర్ బాబు నామినేషన్ వేసిన సందర్భంగా పులమాల, శాలువాతో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అధ్యక్షుడు దండు రమేష్, మత్స్య శాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, జంగిడి సమ్మయ్య, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు కొండ రాజమ్మ, సురేస్ రావు పాల్గొన్నారు.
Spread the love