త్యాగాలు మనవి బోగాలు బీఆర్ఎస్ పార్టీవి

– సీతక్క కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి
నవ తెలంగాణ- గోవిందరావుపేట:
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసింది మనమైతే భోగాలు అనుభవించేది బీఆర్ఎస్ పార్టీ అని ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క అన్నారు. గురువారం మండలంలోని బుసాపురం గాంధీనగర్ ముద్దులగూడెం గ్రామాలలో బీఆర్ఎస్,  సిపిఐఎం పార్టీలకు చెందిన పలువురు నాయకులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూనా చివరి శ్వాస వరకు ములుగు నియోజక వర్గ ప్రజల పక్షాన కొట్లాడుతానని అన్నారు.10 యేండ్ల లో మనకు ఇల్లు ఇవ్వని వాళ్ళు మళ్ళీ గెలిస్తే ఇస్తాం అనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి పేద వారికి 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామన్నారు. బుస్సా పూర్, గాంధీ నగర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, సీపీఎం పార్టీల కు చెందిన పాశం శ్రీనివాస్ రెడ్డి ఆవుల సోమిరెడ్డి, అడేపు కుమారస్వామి, ఎండీ మైపాస్
పోలేపాక మహేందర్, కొమ్రారెడ్డి  మందఎల్లయ్య, రంజిత్, రవీందర్ రెడ్డి, బానోత్ మోతీలాల్, బానోత్ లక్ష్మి, చిలుకమ్మా, సారయ్య తో పాటు100 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి  కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love