తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందాం

– ప్రచారంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి
– అడుగడుగునా నీరాజనం
నవతెలంగాణ- పెన్ పహాడ్: హస్తానికి ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకుందామని కాంగ్రెస్ సూర్యాపేట నియోజక వర్గ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. మండలంలోని అనాజిపురం, దోసపహడ్, నాగులపహాడ్, నారాయణగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ గ్రామంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని కోలాటాలతో స్వాగతం పలికి నీరాజనం పలికారు. ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల కార్యకర్తలను పార్టీ జెండాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారాయణగూడెం గ్రామశాఖ అధ్యక్షుడు నారాయణ ప్రవీణ్ రెడ్డి గజమాలతో సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. పార్టీలో చేరిన వారిలో నారాయణ కృష్ణరెడ్డి, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు నకిరేకంటి యోగి, దొంగరి నాగార్జున, తదితరులు ఉండగా, ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి సంధ్యారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తూముల భుజంగరావు, మండల అధ్యక్షుడు తూముల సురేష్ రావు, మాజీ జెడ్పీటీసీ పీన్నని కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ మండలి జ్యోతి పిచ్చయ్య, గ్రామశాఖ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, విద్యాసాగర్, ఒగ్గు దేవయ్య, ఏపురి నగేష్, నారాయణ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love