కసిరెడ్డి గెలుపుకోసం సైనికుల్లా పనిచేద్దాం

– కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
– పల్లె చెల్క తాండాలో పార్టీ కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-ఆమనగల్:  కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేద్దామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడ్తాల్ మండలంలోని పల్లె చెల్క తాండాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని గురువారం స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ రుణం తీర్చుకోవాలని సూచించారు. అందుకోసం ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా కష్టపడి కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ అద్దాల రాములు, యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు రాపోతు అనిల్ గౌడ్, నాయకులు శ్రీను నాయక్, సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love