- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్ రాజా సుబ్రమణిని తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా నియమించింది. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ మే 30న పదవీ విరమణ చేయనున్నారు. అదే సమయంలో, వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్గా నియమితులయ్యారు. ఆయన మే 31న బాధ్యతలు స్వీకరించి, డిసెంబర్ 31, 2028 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన వెస్ట్రన్ నావల్ కమాండర్గా పనిచేస్తున్నారు.
- Advertisement -



