– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ఒక పార్టీ నుండి మరొక పార్టీకి మారిన వారే ఇంకొకరిని దూషిస్తూ నీతులు పలకడమేంటని,ప్రజా సమస్యలపై చర్చించే సభలో వ్యక్తిగత దుషణలేంటని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని బద్దెనపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… ప్రజల అభీష్టం మేరకు జెడ్పీటీసీ దంపతులు కాంగ్రెస్ లోకి చెరారన్నారు.రెండు పర్యాయాలు జెడ్పీటీసీ గా గెలిచి ప్రజా సేవ చేసిన మంజుల లింగారెడ్డి మీద వ్యక్తిగత దూషణలు చేయడం హెయమైన చర్య అన్నారు.సొంత నియోజకవర్గం లోని సర్పంచు లకు బిల్లులు చెల్లించ లేని అసమర్థ పాలన కెటియర్దన్నారు.పార్టీ మారిన వారే నీతులు మాట్లాడటం సిగ్గు చేటని ఏద్దేవ చేశారు.మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మేల్యేలను,కాంగ్రెస్ నాయకులను గుంజుకున్న చరిత బీఆర్ఎస్ ది కాదా అని ప్రశ్నించారు.ప్రజా సేవలో ఉండి ప్రజల అభిష్టానం మేరకు పనిచేస్తున్న ఏ పార్టీ నాయకులలైన సరే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు.దోపిడే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోని ఏ పార్టీ నాయకులైన కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదన్నారు.నిన్నటి రోజు మండల సర్వ సభ్య సమావేశంలో జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.రాష్ట్రాన్