- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలో బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ ఓసిపి ప్రాంగణంలో కొలువుతిరిన వినాయక మండపంలో వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రుల ఉత్సవాలు జరుపుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెన్కో సిఈ ప్రకాష్ దంపతులు హాజరై గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్,మైన్ మేనేజర్ శ్రీనివాస్,సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు,హెచ్ఆర్ డిజిఎం రమేష్ బాబు,ఉద్యోగులు,కార్మికులు పాల్గొన్నారు.
- Advertisement -



