Wednesday, April 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనిరంకుశ పాలనకు మమ్దానీ విజయం ఒక మందలింపు : సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్

నిరంకుశ పాలనకు మమ్దానీ విజయం ఒక మందలింపు : సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్

- Advertisement -

నవతెలంగాణ ఢిల్లీ: అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నికై చరిత్ర సృష్టించారు. ట్రంప్‌ నుంచి అపారమైన ఒత్తిడిని ఎదుర్కొని దృఢంగా నిలబడినందుకు న్యూయార్క్‌ ప్రజలకు అభినందనలు అని సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్ అన్నారు. మమ్దానీ చరిత్రాత్మక విజయం బహుళ రంగాల్లో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. తమ చర్యలను సమర్థించుకోవడానికి ఎన్నికల ఆదేశాన్ని తప్పుగా చెప్పుకొనే నిరంకుశ పాలనకు ఇది శక్తిమంతమైన మందలింపు. పాలనలో ప్రజలే ప్రధాన పాత్ర పోషించాలని ఇది పునరుద్ఘాటిస్తుందన్నారు.

జాన్‌ బ్రిట్టాస్, సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -