- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని రంజని తండాకు చెందిన జాదవ్ కైలాస్ (42) గురువారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కైలాస్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెందాడన, ఈ క్రమంలోనే మనస్తాపానికి గురై తనకున్న వ్యవసాయ క్షేత్రంలో చేట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ తెలిపారు. మృతుడి భార్య అనిత బాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -



