ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ- మాక్లూర్: మండలంలోని కల్లెడ గ్రామ శివారులో  ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి మరకంటి ముత్తేన్న(45) మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకున్నట్లు ఎస్సై సుదీర్ రావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం కల్లేడ గ్రామంలోని ముత్తేన్న ఉదయాన్నే తన పొలాన్ని దుక్కి దున్నడానికి ట్రాక్టర్ తీసుకొని వెళ్ళాడన్నారు. మార్గమధ్యంలో మరొకరి ఇసుక ట్రాక్టర్ గెట్టు పైకి ఎక్కడం లేదని చూసి ముత్తన్న ఆ ట్రాక్టర్ డ్రైవర్ ను దింపేసి గేట్టు పైకి  ఎక్కించే ప్రయత్నంలో ఒక్కసారిగా ఇంజన్ లేసి తిరగబడటంతో ముత్తన్న అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య మారకంటి సంగీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు.
Spread the love