ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ – వలిగొండ రూరల్
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన మండలంలోని అరూరు గ్రామ  పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని నాగారంకు చెందిన దేశపాక యాదగిరి(26)భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఇతను తోటి కార్మికులతో కలిసి ఆత్మకూర్ (ఎం) మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలోని ఇంటి నిర్మాణ పనులను వెళ్లి పనులు ముగించికొని ఇంటికితిరిగి వస్తుండుగా అరూరు సమీపంలోని పెట్రోల్ పంపు సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి పల్టీపడిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు గాయపడ్డ ఇతనిని 108 వాహనంలో మండల కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి  తరలించి ప్రాథమిక చికిత్స నిర్వహించి అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు అంబులెన్స్ హైదారాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు.పోలీసులకు ఇంకా పిర్యాదు అందలేదని తెలిపారు.
Spread the love