విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..

నవతెలంగాణ – ఓదెల
ఓదెల మండలంలోని జీలకుంట గ్రామానికి చెందిన నల్ల శ్రీనివాస్ రెడ్డి వయస్సు (40) సం” గురువారం రాత్రి విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం కురిసిన వర్షానికి ఇంట్లో కరెంటు పోయింది.ఇంట్లో కరెంటు లేకపోవడంతో చుట్టుపక్కల వారి ఇండ్లల్లో కరెంటు ఉండడంతో విద్యుత్ పోల్ పై ఉన్న విద్యుత్తు తీగ సరిగా ఉందా లేదా చూద్దామని వెళ్లి కరెంటు తీగను కర్రతో కదిలించడంతో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని నిర్ధారించారు. ఇంటి పెద్ద మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Spread the love