కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు

నవతెలంగాణ – తిరుమలగిరి 
భవిష్యత్తు అంతా కాంగ్రెస్ పార్టీదే అని ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. తిరుమలగిరి మండలం కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తిరుమలగిరి పీఏసీఎస్ ఛైర్మెన్ పాలేపు  చంద్రశేఖర్ మరియు డీసీసీబీ, డీసీఎంస్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్, తుంగతుర్తి పీఏసీఎస్ ఛైర్మెన్ గుడిపాటి సైదులు,వెంపటి గ్రామనికి చెందిన విక్రమ్ రెడ్డి కూతురు ఝాన్సీ రాజిరెడ్డి లు బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ లకు రాజీనామా చేసి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమని రేవంత్ రెడ్డి సారధ్యంలోనే  తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అందరం కలిసి రాబోయే ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, నాయకులు గుడిపాటి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్సొజు నరేష్, జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్, మూల అశోక్ రెడ్డి, కొండల్ రెడ్డి,మీడియా ఇన్ఛార్జి కందుకూరి లక్ష్మయ్య, నాయకులు పేరాల వీరేష్ తిరుమణి యాదగిరి, కృష్ణ నాయక్, దానియేలు తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love