తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాలి: మంత్రి

– నేషనల్ మేనిపేస్టో కమిటీ ఛైర్మన్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
నవతెలంగాణ-  మల్హర్ రావు
ఈ నెల 6వ తేదీన శనివారం తుక్కుగూడలో తెలంగాణ జాతర సభను నిర్వహించ బోతున్నామని కాంగ్రెస్ పార్టీ మేనిపేస్టో నేసనల్ చైర్మన్,ఐటి మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు నవ తెలంగాణ తో బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల మాట్లాడారు ఈ జన జాతర కార్యక్రమానికి ముఖ్యదితిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యే లు హాజరవుతారని తెలిపారు.రాహుల్ గాంధీ ఆలోచన మేరకు జన జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.తుక్కుగూడలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బహిరంగా సభ నిర్వహించి ఎన్నికల మేనిపెస్టో ను అక్కడే విడుదల చేయడం జరిగిందన్నారు.తమ ఆరు గ్యారెంటీలతోపాటు మెనిపెస్టును  నమ్మి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టారన్నారు.ఇపుడు లోకసభ ఎన్నికల ముందు తుక్కుగూడలో బహిరంగంగా సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు నడుస్తామన్నారు.ఈ జన జాతర సభకు ప్రధాన నాయకులందరూ హాజరవుతారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని దుద్దిళ్ల పిలుపునిచ్చారు.
Spread the love