మంథని డిపో నుంచి రాజధాని బస్సును ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ – మంథని
పెద్దపల్లి జిల్లా మంథని ప్రయాణ ప్రాంగణంలో మంథని నుండి దిల్ సుక్ నగర్ వరకు నూతన రాజధాని ఏసీ బస్సును ఐటీ,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.అనంతరం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుమాట్లాడుతూ.. మంథని,మహాదేవపూర్, కాలేశ్వరం ప్రయాణ ప్రాంగణాలను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.మూడు నెలల లోపే ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి తీసుకువచ్చామన్నారు. నూతనంగా 1000 బస్సులను వివిధ డిపోలకు అందజేసి ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా చేశామని తెలిపారు.23 కోట్ల మహిళా మణులు డిసెంబర్ నుంచి నేటి వరకు బస్సులలో ప్రయాణించారని ఆయన పేర్కొన్నారు.

Spread the love