మిషన్ భగీరథ లీకేజీలు పరిశీలించిన అధికారులు

నవతెలంగాణ –  మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీ వాటర్ ట్యాంక్ ను, మిషన్ భగీరథ లీకేజీ ను శుక్రవారం  మిషన్ భగీరథ ఏఈ హరిత,పంచాయతీ కార్యదర్శి చెలుకల రాజు యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడారు రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని నీటి ఎద్దడి లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటులో భాగంగా పరిశీలించడం జరిగిందన్నారు.గ్రామస్థాయిలో చిన్న చిన్న లీకేజీలు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love